Balakrishna : వరుణ్ తేజ్ – లావణ్య కి బాలయ్య బాబు స్పెషల్ గిఫ్ట్.. మెగా హీరోలు కూడా ఇంత విలువైన గిఫ్ట్ ఇవ్వలేదుగా!

- Advertisement -

Balakrishna : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎంతో కాలం నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట, నవంబర్ 1 వ తేదీన ఇటలీ లో కుటుంబ సభ్యులు మరియు మిత్రుల సమక్షం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Balakrishna
Balakrishna

నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సెలెబ్రిటీలు మొత్తం హాజరు అయ్యారు. కానీ బాలయ్య బాబు మాత్రం హాజరు కావడం లేదు. బాలయ్య బాబు కి మరియు నాగబాబు కి మధ్య పెద్ద గొడవలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో బాలయ్య పై ఒక రేంజ్ లో సెటైర్ల వర్షం కురిపించాడు నాగబాబు.

VarunLav

కానీ రాజకీయ పరంగా ఇప్పుడు ఇద్దరు ఒక్కటే, అయినా కూడా బాలయ్య నిన్న వెడ్డింగ్ రిసెప్షన్ కి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, బాలయ్య రాకపోయినా కూడా వరుణ్ తేజ్ – లావణ్య జంటకి పుల్లలతో చేయించిన వెంకటేశ్వర స్వామి పటం ని బహుమతిగా పంపించాడట. నాగబాబు మరియు ఆయన సతీమణి ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఇష్టంగా పూజిస్తుంటారు. వరుణ్ తేజ్ కొలిచే దేవుడు కూడా ఆయనే.

- Advertisement -
balakrishna varun tej

కుటుంబం మొత్తానికి ఇష్టమైన దేవుడు అని గమనించిన బాలయ్య , పుల్లలతో ప్రత్యేకంగా ఒక కళాకృతిలాగా తయారు చేయించి, ఒక ఫ్రేమ్ లో పొందుపర్చి బహుమతిగా పంపాడట. కోట్లు విలువ చేసే బహుమతులకంటే, ఇష్టం తో ప్రేమతో తయారు చేయించిన బహుమతి ఎంతో విలువైనది అని, మెగా హీరోలెవ్వరు కూడా ఇలాంటి బహుమతి ఇవ్వలేదని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

naga babu balakrishna
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here