పెళ్లి ఒక బూతు, దానికోసం పెళ్లి అక్కర్లేదు.. ప్రముఖ నటి షాకింగ్‌ కామెంట్స్

- Advertisement -

విలన్‌ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది. 2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిెెంది. 2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత నెగిటివ్‌ రోల్స్‌లో నటించి మెప్పించింది. తాజాగా పెళ్లిపై వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్

బుల్లితెరపై ఓంకార్ హోస్ట్ చేస్తున్నన ‘సిక్స్త్ సెన్స్’ మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 సీజన్లు కంప్లీట్ చేసుకున 5వ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. తాజాగా ఈ షోలో హీరోయిన్లు బిందు మాధవి, వరలక్ష్మి శరత్ కుమార్ పాల్గొన్నారు. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లి గురించి ఓంకార్ అడిగారు. ఇద్దరూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీనికి వరలక్ష్మి క్రాస్ ఫింగర్స్ చూపించింది. దాని అర్థం ఏమిటంటే బూతు, పెళ్లి మేటర్ నా వద్దకు రావద్దు అంది.

“పెళ్లి అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోగలం. పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలి” అని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల్లోకి రావడం, సక్సెస్ గురించి కూడా వరలక్ష్మీ మాట్లాడారు. “నేను ఏం సాధించినా క్రెడిట్ మొత్తం నాదే. ఇంక ఎవరూ లేరు. మా నాన్న శరత్ కుమార్ నటి కావడాన్ని ఇష్టపడలేదు. అది ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మా అమ్మకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. కాబట్టి నా సక్సెస్ వెనుక ఉన్నది నేనే” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కాగా గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశాల్ ని ప్రేమించారు. కొన్నేళ్ల ప్రేమయాణం తర్వాత విభేదాలతో విడిపోయారు. అప్పటి నుండి వరలక్ష్మీ సింగిల్‌గా ఉంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here