మొన్న చిరంజీవితో.. నిన్న రామ్.. ఇవాళ పవర్ స్టార్​తో.. టాలీవుడ్​లో ఊర్వశి రౌటేలాకు పెరుగుతున్న క్రేజ్

- Advertisement -

బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు కూడా టాలీవుడ్​ వైపు చూస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న గుర్తింపు చూసి.. చాలా మంది టాలీవుడ్​లో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు. అందుకే పాత్ర చిన్నదైనా.. ఆ పాత్ర అంతగా సినిమాలో ప్రభావం చూపకపోయినా.. ఇతర భాషల్లో టాప్ స్టార్లుగా పేరుపొందిన వారు కూడా తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేస్తున్నారు. ఇక కొందరైతే ఏకంగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా సరే అంటున్నారు. అందులో ఒకరే బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌటేలా.

ఊర్వశి రౌటేలా
ఊర్వశి రౌటేలా

ఊర్వశి రౌటేలా బాలీవుడ్​లో పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ అంతగా ప్రభావం చూపలేకపోయింది. తరచూ లైమ్ లైట్​లో కనిపిస్తూ.. సోషల్ మీడియాలో కవ్వించే ఫొటోలు పెడుతూ.. ఇక క్రికెటర్ రిషబ్ పంత్​ను స్టాక్ చేస్తూ.. ఇలా రకరకాల కారణాలతో నిత్యం లైమ్ లైట్​లో ఉంటుంది. అయితే ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్​పై పెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్​లో తన సత్తా చాటాలని తాపత్రయ పడుతోంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈ భామకు సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ స్పెషల్ సాంగ్స్​లో నటించేందుకు మాత్రం బోలెడు ఛాన్సులు వస్తున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్​ గ్లామరస్​ బ్యూటీగా చక్రం తిప్పుతోంది ఊర్వశి. తన అందం, అభినయంతో నార్త్​, సౌత్​ అని సంబంధం లేకుండా ఆడియెన్స్​ను ఆకట్టుకుంటోంది. గత కొద్ది కాలంగా సౌత్​ ఇండస్ట్రీపై ఎక్కువ ఫోకస్​ పెట్టి.. ఇక్కడ వరుస ఆఫర్స్​ను అందుకుంటోంది. ఇక టాలీవుడ్​లో ఇటీవల ఈ భామ.. స్పెషల్​ సాంగ్స్​కు కేరాఫ్​ అడ్రస్​గా మారిపోయింది.​ ముఖ్యంగా తెలుగులో గ్లామర్​​ సాంగ్స్​తో ఆకట్టుకుంటూ యూత్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకుంటోంది.

- Advertisement -
chiranjeevi urvasi

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో బాసు వేర్​ ఈజ్​ ది పార్టీ అంటూ కుర్రాళ్లకు కిక్కెక్కించిన ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో ఆ పాటలో ఈ భామ బ్యూటీకి.. డ్యాన్స్​కు తెలుగు యువత ఫిదా అయింది. ఇక ఆ మూవీ తర్వాత ఐదు నెలలో గ్యాప్​లో ‘ఏజెంట్’​గా వచ్చిన అక్కినేని అఖిల్​తో కలిసి ‘వైల్డ్​ సాలా’ అంటూ చిందులేసింది. ఈ పాటతో ఊర్వశి యూత్​లో మరింత పాపులారిటీని పెంచుకుంది. ఈ రెండు పాటలతో తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్​గా మారింది ఊర్వశి. అందుకే బోయపాటి శ్రీను డైరెక్షన్​లో రామ్​పోతినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా మరో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

ఈ భామ ప్రయాణం అక్కడితో ఆగలేదు. టాలీవుడ్​లో మొదటి సినిమాలోనే చిరంజీవితో స్టెప్పులేసిన ఊర్వశి.. ఇప్పుడు చిరు బ్రదర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో చిందులేసేందుకు రెడీ అయింది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న బ్రో మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. పబ్ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్​ కోసం భారీ సెట్ రెడీ చేస్తున్నారట. ఇక ఈ సాంగ్​లో పవన్, సాయిధరమ్​ తేజ్​లతో కలిసి స్టెప్పులు వేసేందుకు ఊర్వశి రౌటేలాను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. ఇలా.. వరుసగా స్పెషల్ సాంగ్స్​తో ఊర్వశి రౌటేలా.. టాలీవుడ్​లో మకాం వేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here