Tamannaah : వామ్మో.. తమన్నా కోసం ఉపాసన ఇంత చేసిందా.. రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడు..!

- Advertisement -

Tamannaah : తమన్నా భాటియా దగ్గర ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాతదే అయినా.. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ డైమండ్ విలువ రూ.2 కోట్లని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆ డైమండ్ రింగ్ తమన్నాకు గిఫ్ట్ గా రావడం.

Tamannaah
Tamannaah

ఆ గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని అట. అది కూడా ఇప్పుడు కాదు.. నాలుగేళ్ల కిందట 2019లో కావడం విశేషం. ఈ డైమండ్ అంత ధర పలకడానికి దాని లుక్ కూడా కారణం. అద్భుతమైన షేప్ లో ఉన్న ఆ డైమండ్.. తమన్నా వేలికి మెరిసిపోతోంది. సైరా నరసింహారెడ్డి మూవీలో తమన్నా నటనకు మెచ్చిన ఉపాసన అప్పట్లో ఈ డైమండ్ రింగును తమన్నాకు ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కింద రామ్ చరణే తెరకెక్కించాడు. 2019లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీగానే కలెక్షన్లను రాబట్టింది.

తాను ఇచ్చిన డైమండ్ రింగుతో తమన్నా ఉన్న ఫొటోను అప్పట్లో ఉపాసన ట్వీట్ చేసింది. సూపర్ తమన్నాకు మిసెస్ ప్రొడ్యూసర్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఉపాసన ఈ డైమండ్ రింగ్ విషయాన్ని వెల్లడించింది. చాలా భారీ సైజులో ఉన్న ఈ డైమండ్ చూడగానే అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఇద్దరూ ఒకరినొకరు మిస్ అవుతున్నట్లు ట్వీట్లు చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి తెరపైకి వచ్చాయి. తమన్నా దగ్గర ఈ డైమండ్ రింగ్ ఒక్కటే కాదు.. మరిన్ని ఖరీదైన నగలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత అరుదైన మరికొన్ని డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here