Unstoppable : అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్, కేటీఆర్.. రికార్డ్స్ బద్ధలవ్వాల్సిందే

- Advertisement -

Unstoppable : నందమూరి బాలకృష్ణ.. ఓవైపు సినిమాలతో వెండితెరను రారాజులా ఏలుతూనే.. మరోవైపు ఓటీటీలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో చేస్తూ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు. బాలయ్య క్రేజ్ తో ఈ షో రెండో సీజన్ నడుస్తోంది. సెకండ్ సీజన్ లో రాజకీయ, సినీ ప్రముఖులు గెస్టులుగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు.. రాధిక, జయసుధ వంటి సీనియర్ హీరోయిన్లు.. అడివి శేష్, శర్వానంద్ వంటి యంగ్ హీరోలు.. ఇంకోవైపు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్లు ఈ షోలు గెస్టులుగా వచ్చి అలరించారు.

Unstoppable
Unstoppable

ఇక ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా గెస్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా షురూ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా రానున్నారట. ఆయనతో పాటు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చరణ్ తో కలిసి వస్తున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇండియాకు రాగానే కేటీఆర్, రామ్ చరణ్ లపై ఎపిసోడ్ షూట్ చేయనుందట ఆహా టీమ్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Ram charan and KTR
Ram charan and KTR

ఇప్పటికే సీజన్ – 2లో వస్తున్న గెస్టుల లిస్టు చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అయిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ షోకు వస్తున్నారనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరోని ఎప్పుడు పిలుస్తారని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన ఆహా దెబ్బకు పవర్ స్టార్ తో ఎపిసోడ్ చేయడానికి రెడీ అయింది. నందమూరి బాలకృష్ణ రెడీ అవ్వడమే కాదు ఆల్రెడీ ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా చేస్తున్నట్లు గ్లింప్స్ చూపించి ఫ్యాన్స్ ను కూల్ చేసింది. పవర్ స్టార్ వస్తున్నారనే విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ రచ్చ షురూ చేశారు. తమ హీరోను కూడా పిలవాలంటూ సోషల్ మీడియా వార్ స్టార్ట్ చేశారు.

- Advertisement -
Ram Charan and KTR
Ram Charan and KTR

ఈ వార్ సీరియస్ కాకముందే మెగాస్టార్ కూడా అన్ స్టాపబుల్ కు వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు వస్తున్న కారణం అది కాదట. ఈ సంక్రాంతికి చిరు.. వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే కాకుండా బాలయ్య.. వీరసింహారెడ్డి కూడా సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది ఒకే సంస్థ. అందుకే ఫ్యాన్స్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్న అన్ స్టాపబుల్ షోలో ఈ రెండు సినిమా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వస్తున్నారట. ఈ ఐడియా కూడా చిరుదేనట. కారణమేదైనా చిరంజీవి వస్తున్నారనగానే ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here