మహేశ్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయి.. ఇండస్ట్రీ హిట్‎గా నిలిచిన సినిమా ఇదే?

- Advertisement -

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన దివంగత నటి సౌందర్య కాంబినేషన్లో ఓ సినిమా తీయాల్సి ఉంది. కానీ అది మిస్ అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. నిజం.. దాదాపు పాతికేళ్ల క్రితం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంతో వచ్చిన సినిమా యమలీల. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఈ చిత్రంలో అలీ, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా నటించారు. నవరస నటనా సార్వభౌను కైకాల సత్యనారాయణ యముడు పాత్రలో జీవించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అలీకి హీరోగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ క్రమంలో అలీ హీరోగా నటించిన చాలా చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఇటు హీరోయిన్ గా చేసిన ఇంద్రజకు కూడా ఆఫర్లు బాగానే వచ్చాయి. హీరోయిన్ గా టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది.

మహేశ్ బాబు
మహేశ్ బాబు

దర్శకుడు కృష్ణారెడ్డి కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా కథను ఎస్వీ కృష్ణారెడ్డి మొదటిగా మహేష్ బాబు, సౌందర్యతో తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ ఈ సినిమా సమయానికి మహేష్ బాబు వయసు.. కేవలం 19ఏళ్లు మాత్రమే.. అప్పటికే సౌందర్య వయసు 22 ఏళ్లు. మహేష్ బాబు కన్నా సౌందర్య మూడేళ్లు పెద్ద. దర్శకుడు కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణకు ఈ సినిమా కథ వినిపించగా చాలా బాగుంది.. కానీ మహేష్ చిన్నపిల్లాడు.. అప్పుడే ఇలాంటి పెద్ద కథలో నటిస్తే దానికి న్యాయం చేయలేడేమో.. వేరే హీరోతో చేయమని ఎస్వీ. కృష్ణారెడ్డికి కృష్ణ సలహా ఇచ్చారట. ఆ తర్వాత ఐదేళ్లకి మహేశ్ బాబు రాజకుమారుడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా సౌందర్య తో యమలీల సినిమా మహేశ్ చేజారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here