Actress : ఒకప్పుడు చెత్త కుప్పలో దొరికిన అమ్మాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా ?

- Advertisement -


Actress : ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో వైరల్అవుతోంది. చెత్తకుప్పలో దొరికిన ఆ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మనం వెండితెరపై చూస్తున్నామా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ నటుల్లో మిథున్ చక్రవర్తి కూడా ఒకరు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. హిందీ ఇతర భాషలలో కలిపి మొత్తంగా 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.

Actress
Actress

మిథున్ చక్రవర్తి లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. తాను యోగితా బాలిని పెళ్లి చేసుకున్నారు. వారి దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు కుమారులు జన్మించారు. అయితే మొదటి నుంచి చాలా సాఫ్ట్ మైండ్ కల మిథున్ చక్రవర్తి ఓ రోజు బెంగాలీ వార్త పత్రికలో ఒక వార్త చదివి చలించిపోయాడు. కోల్ కతాలోని ఒక చెత్త కుప్పలో పసికందును పారేశారన్నది వార్త సారాంశం. అయితే అది చదివి అందరిలాగా అయ్యో పాపం అంటూ వదిలేయకుండా మిథున్ ఆ బాలిక దీనస్థితిని చూసి జాలిపడి దత్తత తీసుకోవాలనుకున్నారు. అతని భార్య కుమారులు కూడా ఆ పసికందును కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానించారు.

అలా దత్తత తీసుకున్న ఆ చిన్నారే ఈ దిశాని చక్రవర్తి . ఇప్పుడు హాలీవుడ్లో ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది. దిశాని పెంపుడు తల్లితండ్రులు సోదరుల ప్రేమ, ఆప్యాయత మధ్య చాలా గారాభంగా పెరిగింది. చీమకుట్టకుండా చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు మిథున్ చక్రవర్తి. ఇప్పుడు ఆమె ఇలాంటి పొజిషన్లో ఉండడానికి కారణం అంటూ పలువురు మిథున్ చక్రవర్తిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆయన అభిమానులు. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి నటనలో పట్టభద్రురాలు దిశాని చక్రవర్తి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here