డబ్బులిచ్చి మరీ ఆదిపురుష్ పై నెగెటీవ్ ట్వీట్లు పెట్టిస్తున్నారు.. ఎలా బయటపడిందంటే..

- Advertisement -

టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ‘ఆదిపురుష్’. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించారు. ఇక మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సత్తా చాటింది. కానీ అదే సమయంలో అనేక వివాదాలు ఆదిపురుష్‌ను చుట్టుముడుతున్నాయి. ప్రభాస్ లుక్స్‌పై కేర్ తీసుకోలేదని దర్శకుడు ఓం రౌత్‌పై ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అసలు ఈ స్థాయిలో నెగెటివిటీ పై కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి.

ఆదిపురుష్
ఆదిపురుష్

జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఫస్ట్ డే ఓవరాల్‌గా రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఒక వర్గం ఈ సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకుంది. మూవీపై ఒక్కో నెగెటివ్ ట్వీట్‌కు రూ. 54 చెల్లిస్తామని మెసేజెస్ ద్వారా నెటిజన్లను కాంటాక్ట్ అవుతూ ‘ఆదిపురుష్ డిజాస్టర్’ క్యాంపెయిన్‌కు తెరతీసింది. అయితే ఒక హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్‌కు సైతం సేమ్ మెసేజ్ రావడంతో అతను స్క్రీన్ షాట్‌ను నెట్టింట షేర్ చేయగా.. యాంటీ టీమ్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

adipurush

‘హాలో సర్.. ఆదిపురుష్ డిజాస్టర్ క్యాంపెయిన్‌లో పాల్గొంటారా? ఇందుకోసం అవసరమైన పిక్స్, సమాచారం మేమే ఇస్తాం. మీరు కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేస్తే సరిపోతుంది. ఒక్కో ట్వీట్‌కు రూ. 54 చెల్లిస్తాం. మీకు ఓకే అయితే వెంటనే చెప్పండి’ అంటూ నెటిజన్లకు మెసేజెస్ పంపిస్తున్నారు. ఇదే స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన ఒక ప్రభాస్ ఫ్యాన్.. సినిమాపై నెగిటివ్ ట్రెండ్‌లో పాల్గొనడానికి యాంటీ బాలీవుడ్ టీమ్ నాకు ఒక్కో ట్వీట్‌కు రూ. 54 చెల్లిస్తుందట. కానీ నేను నా ధర్మాన్ని నా భుజాలపై మోస్తాను. దేని కోసమో ఎప్పటికీ రాజీపడను’ అంటూ నోట్ షేర్ చేస్తూ నిజమైన ఫ్యాన్ అనిపించుకున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here