Hero Suhas : షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్. కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్నాడు సుహాస్. నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఇటీవలే ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రాజకీయాల గురించి హీరో సుహాస్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎలక్షన్ ఎఫెక్ట్ మీ వరకు వచ్చిందా అంటూ ఇంటర్వ్యూవర్ నుంచి సుహాస్ కు ప్రశ్న ఎదురైంది. దీనిపై సుహాస్ స్పందిస్తూ.. ఒకసారి మాత్రం మా మ్యానేజర్ నాకు ఫోన్ చేసి సర్ ఓ పార్టీ వాళ్లు.. మీరు ప్రచారం చేస్తే రెండు కోట్లు డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారంటూ వివరించారు.. ఏంటి నేను ప్రచారానికి వెళ్ళాలా.. వారు ఫోన్ చేశారా.. అని అడగడంతో అవును సార్ అని చెప్పారంటూ తెలిపాడు.
నేను సినిమా ఈవెంట్ లోనే సరిగ్గా మాట్లాడలేను, అలాంటిది రాజకీయ ప్రచారాల్లో నేనేం మాట్లాడతా. నా వల్ల కాదు. ఒకవేళ వెళ్లి ప్రచారం చేసిన ఇలాంటి వాడిని తీసుకొచ్చారేంటని వాళ్లని కూడా జనాలు తిడతారు.. అంటూ సుహాసి చెప్పినట్లు వివరించాడు. భవిష్యత్తులో ఏమైనా పాలిటిక్స్ లోకి వెళ్లే అవకాశం ఉందా అని అడగగా.. నాకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదని.. రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఏ పార్టీ వాళ్ళు రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.