Manisha Koirala : తాగుడుకు బానిసై కెరీయర్‎ను సర్వనాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

Manisha Koirala : సినీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్ షిప్, డేటింగ్, పెళ్లి, విడాకులు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి. పెళ్లిళ్ల కంటే ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలే పాపులర్ అవుతున్నాయి. చేసిన సినిమాలకంటే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మరికొంతమంది లేటు వయసులో వివాహ జీవితానికి స్వస్తి చెబుతున్నారు. మరికొందరేమో జీవితం ఒడిదుడుగులు తట్టుకోలేక డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. మందు, డ్రగ్స్‌కు అలవాటుపడి బంగారంలాంటి కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు.

Manisha Koirala
Manisha Koirala

ఆ జాబితాలో చేరిన హీరోయిన్ మనీషా కొయిరాలా.. ఈ బ్యూటీ పుట్టింది జార్ఖండ్‌లో. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాపులర్ అయింది. తాను ఆమె 1991లో సౌదాగర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాటి స్టార్ హీరోలందరితోనూ ఆడి పాడింది. అరవింద స్వామి సరసన తెలుగు ప్రేక్షకులకు బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత మన్మథుడు నాగార్జునతో క్రిమినల్, విశ్వనటుడు కమల్ హాసన్‌తో భారతీయుడు, అర్జున్‌తో ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో నటించింది.

మనీషా కొయిరాలాకు మంచి పేరు ఎంత త్వరగా వచ్చిందో.. తన కెరీర్ కూడా అంతే త్వరగా ముగిసింది. కెరీర్ చివర్లో తాను మళ్లీ నేపాల్ వెళ్లాలని భావించింది..కానీ ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసైంది.. మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. మద్యం మత్తులో ఉన్న మనీషాను రకరకాలుగా ఫోటోలు తీస్తుండగా తాను మీడియా ప్రతినిధులను వేడుకున్నారు. మనీషా కొయిరాలా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు సమాచారం. దీంతో తన జీవితం తలకిందులయ్యిందని, తన జీవితం ఇలా మారుతుందని కలలో కూడా ఊహించలేదని తెలియజేసింది. మనీషా 2010లో తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్‌ని పెళ్లాడి రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఆమె ఒకానొక సమయంలో క్యాన్సర్ వ్యాధిన పడి నానాబాధలు ఎదుర్కొంది. చివరికి వ్యాధిని జయించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here