ఆర్జీవీ పై శివాజీ ఫైర్.. హాట్ టాపిక్ గా వివాదం

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఆర్జీవీ ఏం చేసినా సంచలనంగా మారుతుంది. ఆయన ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. ప్రముఖ నటుడు శివాజీ పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే ఈసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటుడు శివాజీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన ఆర్జీవీ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు
సంగతి ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలను నిర్మించినప్పుడు ఆర్జీవీ పై శివాజీ స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ

నటుడు శివాజీ మాట్లాడుతూ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలు తీసి ఏం పీకాడు? కమ్మోళ్లను ఏమైనా పీక గలిగాడా ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్మ తెలివైన వ్యాపారవేత్త ఎందుకంటే వర్మ చంద్రబాబు నాయుడుని రోజూ తిడితే జగన్మోహన్ రెడ్డికి అభిమాని అయిపోతాడు. వ్యూహం సినిమాని మడిచి బ్యాగ్ లో పెట్టుకో అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నారని, అందుకే ఆ సినిమా తీస్తున్నారని విమర్శించారు. రేపు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీద వర్మ సినిమా తీయడం ఖాయం. హైదరాబాద్ లో కూర్చుని పోరంబోకులా మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. జగన్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి తన గురించి రాస్తూ.. కమ్మోళ్లను, చంద్రబాబును తిడుతున్నావ్.. నీకేం పని లేదు అంటూ శివాజీ ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా మాట్లాడారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here