Sreerama Chandra : సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన సింగర్ శ్రీరామచంద్ర.. ఎందుకో తెలుసా?

- Advertisement -

Sreerama Chandra : రాజకీయ నేతలు, ప్రభుత్వ ప్రతినిధుల మీటింగ్స్, రోడ్ షోలు, కాన్వాయ్స్ వలన తరచుగా జనాలు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. సాధారణ ప్రజల జీవితాలను పొలిటికల్ ఈవెంట్స్ ఇబ్బందిపెడుతూ ఉంటాయి..ప్రజల ఇబ్బందులతో పని లేదు కానీ వాళ్ళు చెయ్యాలనుకుంది చేస్తారు..అలాంటి ఓ ఘటన సింగర్ శ్రీరామచంద్రకు కోపాన్ని తెప్పించింది.ఓ పొలిటీషియన్ కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారట. దాంతో ఆయన ఎక్కాల్సిన గోవా ఫ్లైట్ మిస్ అయ్యారట. తన అసహనం, పబ్లిక్ ఇబ్బందులు తెలియజేస్తూ ఆయన వీడియో పోస్ట్ చేశారు.. అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Sreerama Chandra
Sreerama Chandra

ఓ రాజకీయ నేత కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ క్రింది నుండి పోవాల్సి వచ్చింది. హెవీ ట్రాఫిక్ ఏర్పడటంతో అరగంట ఆలస్యమైంది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. వేరే ఫ్లైట్ పట్టుకోవడం గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరికొందరు ఇదే రీజన్ తో ఫ్లైట్ మిస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే… పొలిటికల్ లీడర్స్ కోసం సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి…అర్థం చేసుకోండి అంటూ వీడియోలో చెప్పాడు.

ఈ వీడియోను చూసిన వారంతా కూడా నెటిజెన్స్ నుండి మద్దతు లభిస్తుంది. ఆయన వీడియో పలువురిలో అవగాహనకు కారణమైంది. అయితే కొన్ని విషయాల్లో ఎవరేం చేయలేరు. ప్రోటోకాల్ పేరుతో కొన్ని పాటించాల్సిందే. ఇక స్టార్ సింగర్ గా శ్రీరామచంద్రకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇండియన్ ఐడల్ విన్నర్ గా ఉన్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ రాబట్టారు… విజే సన్నీ విన్నర్ కాగా, శ్రీరామ్ రన్నర్ గా నిలిచారు.. ప్రస్తుతం ఈయన సినిమాలతో పాటు షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here