పూజా హెగ్డే ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ

- Advertisement -

పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పూజాహెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అంద చందాలతో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అదిలా ఉంటే తాజాగా ఈమె ఆస్తి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే ఒక్కో సినిమాకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

అంతేకాదు ఆమెకు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉందని, కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈమెకు మొత్తంగా రూ.51 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు. పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది.

పూజా హెగ్డే నటి
పూజా హెగ్డే నటి

పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో సెటిల్ అయ్యారు. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా పుట్టింది ముంబై అయిన తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు. అలాగే ముంబై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో పూజా హెగ్డే కొన్ని ఫ్లాట్స్ ను కొనుగోలు చేసింది. పూజా హెడ్డే తండ్రి మంజునాధ్ హెగ్డే బ‌డా వ్యాపార వేత్త. అలాగే తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. త‌ల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న మెళుకువ‌ల‌తో పూజా హెగ్డే పలు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతోంది . మొత్తంగా పూజా హెగ్డే ఆస్తుల విలువ రూ. 60 కోట్లు ఉంటుంద‌ని ప‌లు నివేధిక‌లు చెబుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here