వామ్మో.. శ‌ర్వానంద్ అన్ని కోట్ల క‌ట్నం తీసుకున్నాడా..

- Advertisement -

ఇన్నేళ్లు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఒకడిగా కొనసాగిన శర్వానంద్ నిన్నతో తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన శర్వానంద్ పెళ్ళికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఈ వివాహ మహోత్సవం జైపూర్ లో కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల సమక్షం లో అంగరంగ వైభవంగా జరిగింది.

శ‌ర్వానంద్
శ‌ర్వానంద్

ఇక‌పోతే శ‌ర్వానంద్ కోసం ర‌క్షిత రెడ్డి ఎన్ని కోట్లు క‌ట్నంగా తెచ్చిందో తెలిస్తే షాక్ అయిపోతారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అయిన ర‌క్షిత‌.. అత్తారింటికి మూడు కేజీల బంగారంతో పాటు ఇర‌వై కోట్లు విలువ చేసే ఆస్తుల‌ను క‌ట్నంగా తెచ్చింద‌ట‌. అలాగే శ‌ర్వానంద్ కు పెళ్లి కానుక‌గా ర‌క్షిత తండ్రి ఓ ల‌గ్జ‌రీ హౌస్ ను ఇచ్చార‌ట‌. శ‌ర్వానంద్‌, ర‌క్షిత త‌మ కొత్త కాపురాన్ని ఆ ఇంట్లోనే ప్రారంభించ‌నున్నార‌ని అంటున్నారు.

Sharwanand

అయితే ఈ పెళ్ళికి శర్వానంద్ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారిలో తనకి ఎంతో దగ్గరైన కొంతమందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కి చిన్నప్పటి నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ పెళ్ళికి ముఖ్య అతిథిగా విచ్చేసి, కాసేపు శర్వానంద్ కుటుంబం తో గడిపి తిరిగి వెళ్ళాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి రక్షిత రెడ్డి తెలంగాణ కి చెందిన అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here