బిగ్ బాస్ 7.. షకీలా ఎలిమినేషన్ కు అసలు కారణం ఇదేనా..!

- Advertisement -

బిగ్ బాస్ 7 నుంచి ఒక్కొక్కరుగా ఆ సీనియర్ కంటెస్టెంట్స్ అంతా వెళ్లిపోతున్నారు. ముందుగా మొదటి వారంలో సీనియర్ నటి కిరణ్ రాథోడ్.. హౌజ్‌ను విడిచి వెళ్లిపోగా.. రెండోవారంలో మరో సీనియర్ నటి షకీలా బిగ్ బాస్‌ను వదిలి వెళ్లిపోయారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హౌజ్‌లో ఉన్నంత వరకు దాదాపుగా అందరు కంటెస్టెంట్స్‌తో బాగానే ఉన్న షకీలా.. బయటికి వచ్చేసింది.

షకీలా.. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక గోల్‌తో అడుగుపెట్టానని అన్నారు. అది సాధించుకోవడానికి కష్టపడు అని తన సన్నిహితులు కూడా చెప్పి పంపారు. కానీ అక్కడ ఉన్న జూనియర్ కంటెస్టెంట్స్‌కు షకీలా.. అమ్మలాగా మారగలిగింది తప్పా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యింది. హౌజ్‌లో ఉన్న ఈ రెండు వారాలు కంటెస్టెంట్స్‌తో షకీలాకు పెద్దగా గొడవలు లేవు. అందుకే వెళ్లేముందు కూడా అందరి గురించి మంచిగానే చెప్తూ వెళ్లిపోయింది. కంటెస్టెంట్స్ అందరిలో ఫ్రెండ్లీ ఎవరు అంటూ ప్రియాంక అని చెప్పింది షకీలా.

అందరిలో ఎక్కువగా అసూయ ఎవరికి ఉంది అని అడగగా.. అందరికీ ఉంది అంటూ సమాధానమిచ్చింది. పొగరు అనే ట్యాగ్ ఎవరికి ఇస్తారు అంటే యావర్ అని చెప్పింది. యావర్‌కు, షకీలాకు ముందు నుండే మనస్పర్థలు వచ్చాయి. హౌజ్‌లో షకీలా ఎవరితో అంత చనువుగా ఉండరు అంటే బిగ్ బాస్ ఫాలో అయ్యే ప్రేక్షకులు.. టక్కున యావర్ అని చెప్పేయగలరు. కంటెస్టెంట్స్‌లో అందరికంటే పల్లవి ప్రశాంత్‌కే ఆవేశం అని ముద్రవేసింది. అందరిలో తను దామినినే ఎక్కువగా నమ్ముతానని చెప్పింది. రతికకు స్టోన్ హార్ట్ అని ట్యాగ్ ఇచ్చింది. షకీలా వెళ్లిపోతుందని హౌజ్‌లో అందరూ ఎమోషనల్ అవ్వగా.. పెదవే పలికిన అనే పాట పాడి షకీలాను ఎమోషనల్ చేసింది దామిని.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here