మెగా హీరో రామ్ చరణ్ వైఫ్ ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతుంది.. అయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి..బిడ్డ ఆరోగ్యం కోసం ఎవ్వరు చెయ్యని పని చేస్తుంది..మరికొన్ని రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. వీరిద్దరికీ పెళ్ళై పదేళ్లు అయ్యాక పిల్లల్ని కంటున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇప్పటికి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఉపాసన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

2022 డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. కోడలు ఉపాసన తల్లి అయ్యారనే వార్త సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. చిరంజీవి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మెగా వారసుడు వస్తున్నాడని వారు సంబరాలు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాసనకు ఘనంగా సీమంతం చేశారు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతున్నాయి..
ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది.. అదేంటంటే.. పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ భద్రపరచనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. భవిష్యత్ లో బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ, బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు కార్డ్ బ్లడ్ వాడి వ్యక్తులను రోగాల నుండి కాపాడవచ్చు.. ఈ విధానాన్ని స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది.
ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ మేరకు ఉపాసన ప్రకటన చేశారు.. ఇక పెళ్ళైన వెంటనే పిల్లలను కనకూడదని ఉపాసన నిర్ణయం తీసుకుందట. ఈ విషయంలో కుటుంబ సభ్యులు, సమాజం నుండి ఒత్తిడి ఎదురైనా వెరవకుండా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీ ప్రకటించారు.. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ దుమారం రేపుతుంది..