Sakshi Agarwal : డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడంటూ లబోదిబో మొత్తుకుంటున్న స్టార్ హీరోయిన్

- Advertisement -


Sakshi Agarwal : సినిమా అనేది రంగుల ప్రపంచం. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓ సినిమా మొదలై.. రిలీజ్ అయ్యేంత వరకు సినిమాలో ఎవరెవరు ఉంటారు..? ఎవరు వెళ్తారనేది కష్టం. అంతకు ముందు హీరోయిన్లుగా అనుకున్నవారు.. కొన్ని కారణాల వల్ల సెకండ్ హీరోయిన్లుగా మారుతారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అవుతుందో… ఎడిటింగ్ లో లేచిపోతారో తెలియదు. సినిమా విడుదలైన తర్వాత.. వెండితెరపై చూసుకుని.. ఆ తర్వాత దర్శకనిర్మాతలను నటీనటులు తిట్టడం మామూలే.

Sakshi Agarwal
Sakshi Agarwal

తాజాగా హీరోయిన్ సాక్షి అగర్వాల్ కూడా దర్శకుడు అట్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కోలీవుడ్ నటి సాక్షి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాను మోడల్‌గా పనిచేస్తున్న రోజుల్లో రాజారాణికి సినిమా ఆఫర్ వచ్చింది. ఆర్య, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని సాక్షి అగర్వాల్ ని సంప్రదించారట. ఆర్య హీరోగా, సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట.

Sakshi Agarwal Updates

“నేను రాజారాణి సినిమా షూటింగ్‌కి వెళ్లాను.. వాళ్లు నాపై చాలా సీన్లు చిత్రీకరించారు. ముఖ్యంగా షాపింగ్ మాల్‌లోని సీన్స్‌తో పాటు మరికొన్ని సీన్లు కూడా తీశారు.. రిలీజ్ తర్వాత నా సీన్లన్నీ తీసేశారు.. అది చూసి షాక్ అయ్యాను. అదే సమయంలో దర్శకుడు అట్లీతో ఈ విషయం మాట్లాడితే బాగుండేది.. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పే.. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని అట్లీ మోసం చేశాడు. అంటూ వాపోయింది. ప్రస్తుతం సాక్షి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here