చంద్రముఖి2 సినిమాకు సాయిపల్లవికు ఉన్న సంబంధం తెలుసా..!

- Advertisement -

రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో 2005లో వచ్చి భయపెట్టిన చిత్రం ‘చంద్రముఖి’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ సిద్ధమైన సంగతి తెలిసిందే. రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘చంద్రముఖి 2’లో ప్రధానపాత్ర కోసం చిత్రబృందం మొదట సాయిపల్లవిని సంప్రదించిందట.

సాయిపల్లవి
సాయిపల్లవి

కళ్లతో హావాభావాలు పలికించగల నాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఆమె అయితే ‘చంద్రముఖి 2’ లీడ్‌ రోల్‌కు సరిపోతుందని మేకర్స్‌ భావించారట. ఈ విషయమై సాయి పల్లవితో సంప్రదింపులు కూడా జరిపారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాను తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ అవకాశం కంగనా రనౌత్‌ను వరించిందని అంటున్నారు. ఒకవేళ సాయి పల్లవి ఇందులో నటించి ఉంటే తన డ్యాన్స్‌, నటన కచ్చితంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవని ఆమె అభిమానులు అంటున్నారు.

తాజాగా విడుదలైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్‌లో కంగనా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అవకాశం అడిగి మరీ ఇందులో నటించినట్లు కంగన తెలపడం విశేషం. సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. ఇక చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కూడా చిత్రబృందం మొదటగా సాయి పల్లవిని సంప్రదించింది. అయితే ఇది రీమేక్ సినిమా కావడంతో ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆ అవకాశం కీర్తి సురేశ్‌ తలుపు తట్టింది. ఈ సినిమా ఫలితాన్ని పక్కనపెడితే చిరంజీవి- కీర్తి సురేశ్‌ల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here