‘బ్రో’ మూవీ షూటింగ్ స్పాట్ లో సాయి ధరమ్ తేజ్ గొడవలు..విడుదల అవ్వాల్సిన టీజర్ వాయిదా!

- Advertisement -

ఈ ఏడాది విరూపాక్ష చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. వచ్చే నెల 28 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

బ్రో' మూవీ
బ్రో మూవీ

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లు విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ వచ్చే నెలలో విడుదల పెట్టుకొని కూడా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇంకా విడుదల చెయ్యకపోవడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ టీజర్ విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్ అట.

ఈ చిత్రం లో ఆయనకీ సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు ఈ చిత్రం టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ సాయి ధరమ్ తేజ్ షూటింగ్ లొకేషన్ లో తన మ్యానేజర్ సతీష్ తో గొడవలు పెట్టుకున్నాడట. చిన్న విషయం లోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సాయి ధరమ్ తేజ్ కోపం తో సతీష్ పై చెయ్యి చేసుకున్నాడట.

- Advertisement -

అంతే కాదు మ్యానేజర్ పోస్టు నుండి అతనిని తొలగించి, గీత ఆర్ట్స్ లో ఎంతో కాలం నుండి పనిచేస్తున్న అనుభవం ఉన్న వ్యక్తిని తన మ్యానేజర్ గా పెట్టుకున్నాడట. ఈ సినిమా సోషల్ మీడియా ప్రొమోషన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం సతీష్ చూసుకునేవాడట.ఇప్పుడు ఆయన మధ్యలోనే వైదొలగడం తో మూవీ టీజర్ వాయిదా పడిందని అంటున్నారు ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here