‘ఆదిపురుష్’ సినిమాలో పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న మేకర్స్

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ ఈ నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పాటలు మరియు ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నుండి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 180 కోట్ల రూపాయలకు తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఎల్లుండి తిరుపతి లో జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా భారీ మొత్తం లో ఖర్చు చేయబోతుంది మూవీ టీం. ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడ తగ్గకుండా చూసుకునే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ త్వరలోనే ఒక సెన్సషనల్ న్యూస్ ని అధికారికంగా ప్రకటించబోతుంది.ఇక అసలు విషయానికి వస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని వచ్చే నెల 28 వ =తారీఖున గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. అయితే వచ్చే నెలలో సినిమా పెట్టుకొని కూడా ఇప్పటి వరకు బ్రో కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు. అయితే బ్రో విషయం లో నిర్మాతలకు వేరే ప్లాన్ ఉంది.

- Advertisement -

అదేమిటంటే ఈ సినిమా టీజర్ ని ఆదిపురుష్ తెలుగు వెర్షన్ ప్రింట్ కి జత చేసి, థియేటర్స్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. థియేట్రికల్ వెర్షన్ లో ప్లే అవ్వాల్సిన టీజర్ కాబట్టి రెండు నిమిషాల నిడివి ఉండేట్టుగా టీజర్ ని కట్ చేస్తున్నారట. ఇప్పటికే ఫైనల్ వెర్షన్ కాపీ సిద్ధం అయ్యిందని , థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేస్తే, ఆదిపురుష్ సినిమాతో ఈ టీజర్ ని అటాచ్ చేసి థియేటర్స్ లోకి వదులుతారట. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here