Renu Desai: తన బాధకి కారణమైన వ్యక్తిని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రేణు దేశాయ్..

- Advertisement -

Renu Desai: టాలీవుడ్ లోకి బద్రి సినిమా ద్వారా పరిచయమయ్యింది హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాతో నటించి ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. కానీ 2012లో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ కు అకీరా, ఆద్య అనే పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటుంది రేణు దేశాయ్. పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది.పరోక్షంగా ఎవరినో ఒకరిని ఉద్దేశించి అంటున్నట్లుగా ఆమె పోస్టులు ఉంటాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

Renu Desai
Renu Desai

తాజాగా ఇప్పుడు మరొకసారి నేటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు.. ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. ఈ పోస్టులో.. ఎండలో చల్లని గాలిలా.. అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తూ ఉంటారు.. వారి చూపులు మన హృదయాలతో మాట్లాడుతాయి.. వారితో మీరు గడిపిన కొద్ది గంటల జీవితాన్ని అయినా సరే గుర్తుండిపోతాయి.. కానీ ఎడబాట్లు తీరనివేదనని మిగులుస్తాయి..కొందరు మాత్రం మీ బాధలు తొలగించి ఆనందాన్ని నింపుతారు.. అంటూ రేణు దేశాయ్ ఆసక్తికరమైన ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన అభిమానులు సైతం తనకు దూరమైన వ్యక్తుల గురించి ఉద్దేశించి రేణు దేశాయ్ ఇలా కామెంట్స్ చేసిందేమో అన్నట్లుగా తెలియజేస్తున్నారు.ఆమె జీవితంలో కొత్తగా ఎవరైనా వ్యక్తులు వచ్చారా ? లేకపోతే విడాకుల గురించి ఈమె ఇలా ఉద్దేశించి కామెంట్లు చేసిందా? అనే అనుమానాలు అభిమానులలో కలుగుతున్నాయి. 2012లో రేణు దేశాయితో విడిపోయిన పవన్ కళ్యాణ్ 2013లో మూడో వివాహం చేసుకున్నారు.. అయినప్పటికీ పవన్ కళ్యాణ్, రేణు దేశాయి తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని సమాచారం. తన కుమారుడు అకీర, ఆధ్యా తో కలిసి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు. మరి రేణు దేశాయ్ ఈ వీడియో పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here