Pooja Hegde ఇంట్లో తీవ్ర విషాదం.. సినిమాలకు అందుకే దూరం అయ్యిందా?

- Advertisement -

Pooja Hegde : నిన్న మొన్నటి వరకు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగిన పూజా హెగ్డే అకస్మాత్తుగా మాయం అయిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఆమెకి ఉన్న క్రేజ్ కారణంగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్క మెట్టు పైకి ఎక్కాలనే ఆశతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి.

Pooja Hegde
Pooja Hegde

ఆమె ఇచ్చిన ఈ చిన్న గ్యాప్ లో ఇక్కడ శ్రీలీల పూజ హెగ్డే స్థానాన్ని ఆక్రమించేసుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా మీద ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. క్లిక్ అయితే బాలీవుడ్ లో పూజా హెగ్డే కి తిరుగే లేదు. ఒకవేళ క్లిక్ కాకపోతే మాత్రం ఆమె పని ఇక అయిపోయినట్టే.

Pooja Hegde Photos

ఇది ఇలా ఉండగా పూజా హెగ్డే సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. అదేమిటంటే ఆమె ఎంతగానో ఇష్టపడే తన అమ్మమ్మ ఈమధ్య కాలం లోనే మరణించింది అట. తాను ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తన అమ్మమ్మ తో మాట్లాడనిదే ఆమె రోజు ప్రారంభం అవ్వదట. అలాంటి అమ్మమ్మ చనిపోవడం తో చాలా డిప్రెషన్ కి గురి అయ్యినట్టు తెలుస్తుంది.

- Advertisement -

సగం ఈ డిప్రెషన్ కారణంగానే ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నట్టు టాక్. రీసెంట్ గానే ఆమె తమ అమ్మమ్మ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ‘మిస్ యు అజ్జి’ అంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలను చూస్తే ఆమెకు తన అమ్మమ్మ తో ఎంత అనుభందం ఉందో అర్థం అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here