Pavitranadh : మొగలిరేకులు పవిత్రనాథ్ చనిపోవడానికి అదే కారణమా.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు..

- Advertisement -

Pavitranadh : తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ మరణించారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. లాంటి పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తక్కువ ఏజ్ లోనే మరణించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అయితే పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

ఇంద్రనీల్, మేఘన.. తమ సోషల్ మీడియాలో.. పవి.. ఈ బాధని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్ను చాలా మిస్ అవుతున్నాం, చివరి చూపు కూడా చూడలేదు, నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు అసలు ఏమైంది, ఎలా చనిపోయాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో పవిత్రనాథ్ పై అతని భార్య సంచలన ఆరోపణలు చేసింది.

తనని బాగా టార్చర్ చేసాడని, నా ముందే వేరే అమ్మాయిలతో తిరిగేవాడని, నన్ను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేయగా అప్పుడు పవిత్రనాథ్ వైరల్ అయ్యాడు. కాగా పవిత్రనాథ్ చనిపోవడానికి కారణం అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పాటు.. మానసికంగా కూడా చాలా కుంగిపోయాడనేది అతనితో పాటు పనిచేసిన సహ నటులు చెప్తున్న మాట. ఆరేళ్ల క్రితం పవిత్రనాథ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పటి నుంచి అతనికి ఆరోగ్యం బాగా క్షీణించింది. దానికి తోడు పర్సనల్ లైఫ్‌లో కూడా.. భార్యతో విభేదాలు ఇతర కారణాల వల్ల తాగుడికి బానిస అయ్యాడట పవిత్ర నాథ్. అతని లివర్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయని.. ఆరోగ్యం బాగా క్షీణించడంతోనే చనిపోయాడని అతని సన్నిహితులు తెలియజేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here