Bigg Boss Telugu : నా మీద చెయ్యి వేస్తే పగిలిపోతాది అంటూ పల్లవి ప్రశాంత్ కి వార్నింగ్ ఇచ్చిన రతికా.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Bigg Boss Telugu : భారీ అంచనాల నడుమ రెండు వారల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా ముందుకు సాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మొత్తం మొదటి ఎపిసోడ్ నుండే టాస్కుల విషయం లో ప్రాణం పెట్టి ఆడేస్తున్నారు. అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ సీజన్ లో ప్రేక్షకులను ఎంతో ఆసక్తికరంగా చూసేలా చేస్తున్న టాస్క్ ‘పవర్ అస్త్ర’.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఈ పవర్ అస్త్ర ని సొంతం చేసుకునే వరకు కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు కాలేరు. ఇప్పటి వరకు శివాజీ మరియు సందీప్ ఈ పవర్ అస్త్ర ని గెలుచుకున్నారు. సందీప్ కి 5 వారాలు నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ రాగా, శివాజీ కి నాలుగు వారాలు ఇమ్మ్యూనిటి వచ్చింది. ఇక ఈ వారం పవర్ అస్త్ర టాస్కు కి అమరదీప్, ప్రిన్స్ యావర్ మరియు శోభా శెట్టి ని బిగ్ బాస్ సెలెక్ట్ చేసాడు.

వీరిలో ఎవరు పవర్ అస్త్ర ని గెలుచుకోబోతున్నారో చూడాలి. అయితే కాసేపటి క్రితమే విడుదల చేసిన బిగ్ బాస్ 7 లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈ ప్రోమో లో ప్రేమ జంట పల్లవి ప్రశాంత్ మరియు రతికా ఒక రేంజ్ లో గొడవ పడుతున్నారు.

- Advertisement -

ముందుగా పల్లవి ప్రశాంత్ వెళ్ళవమ్మా, అవతలకి వేళ్ళు అని చాలా పొగరుగా రతికా తో అంటాడు. అప్పుడు రతికా మర్యాదగా మాట్లాడు, ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పా అని అంటుంది. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఇంకా రెచ్చిపోయి వెళ్ళవమ్మా అని భుజం మీద చెయ్యి వేసి నెట్టుతాడు. అప్పుడు రతికా ‘ఏయ్.. ఇంకోసారి నా మీద చెయ్యి వేస్తే మర్యాదగానే ఉండదు చెప్తున్నా’ అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here