ఆ విషయంలో ప్లేట్ మార్చిన రష్మిక.. భలే పద్దతిగా వేదాంతం చెబుతుందిగా..

- Advertisement -

కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో చాలా బిజీగా ఉన్న నటి. అయినప్పటికీ రష్మికపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఉన్నాయి. ఆమె చేసే కామెంట్స్, ఇతర కారణాలతో విమర్శల పాలవుతూనే ఉంది. ఎక్కువ కన్నడ ప్రజలు ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె కన్నడ సరిగా మాట్లాడదు అనే విమర్శ కూడా ఉంది. మరో కారణం ఏంటంటే.. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి గురించి కూడా తేలిగ్గా మాట్లాడటం. రష్మికను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది వీరిద్దరే. అయితే తాజాగా ఈ విషయాన్ని రష్మిక ఒప్పుకుంది. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి విషయంతో తన మనసు మార్చుకుంది.

రష్మిక
రష్మిక

కిరిక్ పార్టీ కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. ఆ సినిమా అక్కడ హిట్ అవ్వడంతోటే తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి చలో సినిమాతో హీరోయిన్గా లాంచ్ చేయించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె అక్కడ ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని తెలుగులో సినిమాలు చేసే పనిలో పడి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత బాలీవుడ్ లో కూడా లక్కు పరీక్షించుకునేందుకు అక్కడకి కూడా వెళ్ళింది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక కొటేషన్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.

Pooja Hegde Rashmika Mandanna

రష్మిక తాజాగా తన ఫోటో ఒకదాన్ని షేర్ చేసి కోలుకో, నేర్చుకో, ఎదుగు, ప్రేమించు అంటూ నాలుగు పదాలు షేర్ చేసింది. ఆమె చెప్పింది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. అదేమంటే గతంలోని నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆ తర్వాత మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వాలో నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటో షేర్ చేస్తున్న సమయంలో ఆమె చాలా ట్రెడిషనల్ గా కనపడుతూ చేతిలో ఒక ఆకుని కంటికి అడ్డం పెట్టుకొని షేర్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here