ఇంత మంచి అమ్మాయిని అన్ని మాటలు అంటాారా.. ఫైర్ అయిన రష్మిక

- Advertisement -

ఇటీవల తెలుగు అమ్మాయే అయిన తమిళ నటి ఐశ్వర్య రాజేష్.. ‘పుష్ఫ’లో శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటవుతుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం.. తానైతే శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే బాగా చేసేదాన్నని ఐశ్వర్య వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ హర్టయి ఐశ్వర్యను టార్గెట్ చేశారు. చాలా సున్నితంగా కనిపిస్తూ, అంతే సున్నితంగా మాట్లాడే ఐశ్వర్య.. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఆలస్యం చేయకుండా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేసింది.

రష్మిక
రష్మిక

రష్మికను తక్కువ చేసేలా తానేం మాట్లాడలేదని.. ఆమె పట్ల తనకెంతో గౌరవం ఉందని.. తనకు శ్రీవల్లి పాత్ర నచ్చిందని, తనకా పాత్ర బాగా సూటవుతుందని మాత్రమే అన్నానని ఆమె ఈ నోట్‌లో పేర్కొంది. ఈ వివాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక.. ఆ నోట్ మీద ట్విట్టర్లో స్పందించింది. ‘‘హాయ్ లవ్.. ఇది నేను ఇప్పుడే చూశా. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మన గురించి మనం ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు నీ పట్ల ప్రేమ, గౌరవ భావాలు మాత్రమే ఉన్నాయి. నీ కొత్త సినిమా ఫర్హానాకు నా శుభాభినందనలు’’ అని ఫైర్ అయింది.

Aiswarya rajesh

ఐశ్వర్య అంటే ఏమిటో తనకు అర్థమైందని, ఫర్హానా నటి పట్ల తనకు గొప్ప అభిమానం తప్ప మరేమీ లేదని రష్మిక రాశారు. ఇద్దరు నటీమణుల మధ్య ఈ అందమైన స్నేహబంధాన్ని అభిమానులు ఇష్టపడుతున్నారు. వృత్తిపరంగా, ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు ధృవ నక్షత్రం, మోహన్‌దాస్, తీర కాదల్ మరియు అజయంతే రందం మోషణం వంటి ప్రాజెక్ట్‌లలో భాగం గా ఉంది. మరోవైపు రష్మిక ప్రస్తుతం పుష్ప2, యానిమల్, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here