Ranbir Kapoor : యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ అంత సాహసం చేశాడా.. నువ్వు గ్రేట్ బాసూ..!

- Advertisement -

Ranbir Kapoor : బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తాను నటిస్తోన్న ‘యానిమల్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్‌ ట్రైలర్‌ నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్‌లో రణబీర్ ఇంటెన్స్ లుక్ చూసి గూస్‌బంప్స్‌ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో రణబీర్.. సంజు చిత్రంలో తన పాత్ర కంటే చాలా మెరుగ్గా కనిపించాడు. వీటన్నింటి మధ్య రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాకి ఫీజు తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం

Ranbir Kapoor
Ranbir Kapoor

రణబీర్ కపూర్ మొత్తం మంచి సినిమాను ఇచ్చేందుకు.. అంతే కాకుండా సినిమా నాణ్యత మరింత పెరగడానికి ఎల్లప్పుడు నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే యానిమల్ సినిమాకు కూడా తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రానికి తన ఫీజును 70 కోట్ల నుండి 35 కోట్లకు తగ్గించినట్లు వర్గాల నుండి సమాచారం అందింది. తగ్గించిన రెమ్యునరేషన్ డబ్బులు చిత్రం నిర్మాణానికి పెట్టుబడి పెట్టేందుకు సహాయపడిందని తెలుస్తోంది.

- Advertisement -
Animal  movie

ఈ చిత్రం కోసం రణబీర్ కపూర్ సినిమా లాభంలో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ తొలిసారిగా లాభాలను పంచుకునే విధానాన్ని అనుసరించడం గమనార్హం. దీనికి ముందు ముగ్గురు ఖాన్‌లతో సహా పరిశ్రమలోని చాలా మంది నటులు ఇలా ఫాలో అవుతున్నారు. ‘యానిమల్’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్‌లో రణబీర్ కపూర్ ఘాటు లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్రైలర్‌లో సినిమాలో తన తండ్రి పాత్రను పోషిస్తున్న అనిల్ కపూర్‌తో రణబీర్ వింత బంధం కనిపించింది. రష్మిక మందన్నతో అతని కెమిస్ట్రీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ట్రైలర్లో బాబీ డియోల్ భయంకరమైన విలనిజం కనిపించింది. ఓవరాల్‌గా ‘యానిమల్‌’ చిత్రం చాలా అద్భుతంగా ఉందని, విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్‌ వద్ద సునామీని సృష్టించగలదని ‘యానిమల్’ ట్రైలర్‌ నిరూపిస్తోంది. ‘యానిమల్’ తొలిరోజు రూ.50 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ‘యానిమల్’ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ వంటి పలువురు నటీనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here