Animal Movie : ‘ఎనిమల్’ లో ఆ సన్నివేశాలు చెయ్యడం వల్ల నా భార్య నాతో మాట్లాడడం మానేసింది : రణబీర్ కపూర్

- Advertisement -

Animal Movie: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన చిత్రం ‘ఎనిమల్’. మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ డైరెక్టర్ చూపించినంత బోల్డ్ గా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ని చూపించాడు సందీప్. యాక్షన్ సన్నివేశాలతో పాటుగా రొమాంటిక్ సన్నివేశాలు కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక మందన, ఇప్పటి వరకు సౌత్ లో ఎప్పుడూ చెయ్యని రేంజ్ హాట్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఇలా సినిమా మొత్తం అడుగడుగునా బోల్డ్ కంటెంట్ నింపేసాడు డైరెక్టర్. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రణబీర్ కపూర్ భార్య అలియా భట్ కి ఇబ్బంది గా అనిపించాయట. ముఖ్యంగా త్రిప్తి దిమిరి తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలను ఆమె తీసుకోలేకపోయింది అట. సినిమా ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత ఆ సన్నివేశాల కారణంగా ఒక వారం రోజులు అలియా భట్ నాతో మాట్లాడడం మానేసిందని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.

- Advertisement -

సినిమా ప్రారంభం ముందు సందీప్ ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను, ఇలా హద్దులన్నీ చెరిపేసి హింసాత్మక సన్నివేశాల్లో, అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేనేమో అనుకున్నాను. కానీ ఆ సమయం లో నా భార్య అలియా భట్ బాగా సపోర్ట్ చేసింది . సినిమా కోసమే కదా నువ్వు ఇది చేస్తున్నావ్, ఏమి కాదు అని భరోసా ఇచ్చింది. అలా ధైర్యం చెప్పిన మనిషే ఇబ్బంది పడింది అంటే ఏ రేంజ్ బోల్డ్ గా డైరెక్టర్ నన్ను చూపించాడో అర్థం అయ్యింది అంటూ రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here