ఫ్యాన్స్ కు పూనకాలొచ్చే న్యూస్.. మెగాస్టార్, రామ్ చరణ్ కాంబోలో మూవీ.. డైరెక్టర్ ఫిక్స్ ?

- Advertisement -


టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‎గా ఎదిగారు రామ్ చరణ్. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పటికీ కూడా అదే క్రేజ్ తో వరుస సినిమాలు చేసుకుంటూ అగ్రహీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయి. పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమై.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చిరు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఐదు సినిమాలు చేస్తే అందులో రూ .200 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఉండగా మూడు డిజాస్టర్ అయ్యాయి. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు చిరు గ్రాఫ్ ను కాస్త తగ్గించాయనే చెప్పాలి. ముఖ్యంగా భోళా శంకర్ విషయంలో చిరంజీవిని అభిమానులు అస్సలు ఒప్పుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం చిరుకు కచ్చితంగా కమ్ బ్యాక్ కావాల్సిందే. ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన సినిమా కోసం చిరంజీవి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్
మెగాస్టార్

ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తనకు యాప్ట్ అయ్యే కథనే ఎంచుకుని హిట్ కొట్టాలని గట్టి కసిమీద ఉన్నారు. అందుకే చిరంజీవి తన తదుపరి సినిమా వంద కోట్ల డైరెక్టర్ తో తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్కు బింబిసార వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ట తో చేయబోతున్నారని కొందరు చెబుతుండగా.. కాదు డైరెక్టర్ మురుగదాసుతో చేయబోతున్నారని కొందరు అంటున్నారు. ఒకవేళ ఈ రెండు కుదరకపోతే ఫుల్ ఫాంలో ఉన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో చిరంజీవి ఒక సినిమా ఉంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈనెల 22న వెల్లడికాబోతున్నట్లు సమాచారం. మరి తండ్రి కొడుకులు కలిసి ఇండస్ట్రీ హిట్ ఇస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here