Ram Charan విషయంలో ఆ ప్రచారమే నిజమైందిగా..

- Advertisement -

Ram Charan హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమాకి తాను సంగీతం అందించనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ తెలిపారు. ఆ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తారంటూ ఇటీవల రూమార్స్‌ వచ్చాయి.

Ram Charan
Ram Charan

‘నాయకుడు’ సినిమా ప్రెస్‌మీట్‌లో రెహమాన్‌ వాటిపై స్పందించారు. ఆ ఊహాగానాలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. అధికారిక ప్రకటన వెలువడటమే ఇక ఆలస్యం. రెహమాన్‌ తెలుగు చిత్ర పరిశ్రమ వారితో పనిచేయడం కొత్తేమీ కాదు. కెరీర్‌ ప్రారంభంలోనే.. వెంకటేశ్‌ ‘సూపర్‌ పోలీస్‌’, రాజశేఖర్‌ ‘గ్యాంగ్‌ మాస్టర్‌’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కొన్నాళ్ల విరామం అనంతరం, మహేశ్‌ బాబు ‘నాని’, పవన్‌ కల్యాణ్‌ ‘కొమరం పులి’, నాగ చైతన్య నటించిన ద్విభాషా చిత్రాలు ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’కు మ్యూజిక్‌ అందించి, అలరించారు. ఉదయ నిధి స్టాలిన్‌, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేశ్‌, వడిలేలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మామన్నన్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి రెహమాన్‌ సంగీతం అందించారు.

తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ పేరుతో ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెహమాన్‌ మీడియాతో ముచ్చటించారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన డెలివరీ కోసం దాదాపు 40 రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు రామ్ చరణ్. దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత జులై 12న సెట్ లో అడుగుపెట్టారు రామ్ చరణ్. దీంతో మూవీ టీమ్ సెట్ లో సంబరాలు జరిపారట. దీనికి సంబందించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here