Rakul Preet Singh : ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్న స్టార్ హీరోయిన్.. కారణం ఇదే ?

- Advertisement -

Rakul Preet Singh : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత గుర్తుంది కదా. దీనిని సినిమా వాళ్లు కచ్చితంగా పాటిస్తుంటారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ అంటేనే అదో మాయాలోకం .. ఎప్పుడైనా ఏమైనా జరుగొచ్చు. ఎవరి తలరాత ఎప్పుడు మారిపోతుందో ఎవరికి తెలియదు. అలాంటి సందర్భాలు ఇన్నాళ్ల ఇండస్ట్రీలో ఎన్నో చూసాం. అయితే రీసెంట్ గా ఓ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాను ఇటు టాలీవుడ్లో రామ్ చరణ్, మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించింది. వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అందుకుంది.

Rakul Preet Singh
Rakul Preet Singh

అటు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి తనదైన యాక్టింగ్ తో శభాష్ అనిపించుకుంది. ఇటీవల తాను ప్రేమించిన బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు.. కానీ ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి అంటూ డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేసింది.

పెళ్లి తర్వాత వెంటనే సినిమాలపై కాకుండా ఇలా బిజినెస్ పై ఇంట్రెస్ట్ చూపించడంతో జనాలకు కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. అంతేకాదు ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందని అందుకే బిజినెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల క్రేజ్ పడిపోతుంది. కెరీర్ కొనసాగించినా పెళ్లి తర్వాత ఎలాంటి రోల్స్ వస్తాయో రకుల్ కి తెలుసు.. అందుకే ఆమె ఇండస్ట్రీ నుంచి తప్పకుంటుందట..!

- Advertisement -

ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ F45 జిమ్ బిజినెస్ ఫ్రాంచైజీ ప్రారంభించి సక్సెస్ అయింది. పలు F45 జిమ్, ఫిట్నెస్ సెంటర్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించింది. హైదరాబాద్ లోనే తన మొదటి రెస్టారెంట్ ని మొదలుపెట్టడం గమనార్హం. హైదరాబాద్ లో ‘ఆరంభం’ అనే పేరుతో రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here