వాళ్ల మా నాన్నను ఎంతో బాధపెట్టారు.. రాకేష్ మాస్టర్ కొడుకు సంచలన కామెంట్స్

- Advertisement -

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య కారణంగా.. ఇటీవల మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి టాలీవుడ్లో అందరూ ఎంతో బాధగా ఉన్నారు. సడన్గా అతనికి ఇలా జరగడం అందరికీ షాకింగ్ గానే ఉంది.మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వలన రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ హాస్పిటల్ లో డాక్టర్స్ చెప్పారు. అలాగే ఆయన అంత్యక్రియలకు ఎంతోమంది సినీ ప్రముఖులు, సినీ కొరియోగ్రాఫర్లు వచ్చి ఎంతో బాధగా పాల్గొని.. ఆయన చివరి చూపులు చూసుకొని వెళ్లారు.

రాకేష్ మాస్టర్
రాకేష్ మాస్టర్

వందలాది అభిమానుల నడుమ బోరబండలోని స్మశాన వాటికలో ఆయన కుమారుడు చరణ్ అంత్యక్రియలు చేశాడు. రాకేష్ మాస్టర్ మరణం అనారోగ్య కారణంగా జరిగిందని వైద్యులు చెబుతున్నప్పటికీ.. ఆయన సన్నిహితులు మాత్రం అది అనారోగ్యం వల్ల జరిగిన మరణం కాదని.. ఆయన మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన తనయుడు చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘మా నాన్న ఇంతలా దిగజారిపోవడానికి మీడియానే కారణం.. ఆయనను ఎంత నెగిటీవ్ గా చూపించాలో అంతగా చూపించారు.. ఇక చాలు ఆయనకు సంబంధించిన విషయాలు, మా కుటుంబ సభ్యుల జోలికి మీడియా వస్తే ఊరుకునేది లేదు.. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని మీడియాలో ఎక్స్‌పోజ్ చేసి అల్లరి చేసింది చాలు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ కష్టాలు ఏంటీ? మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? చనిపోతే మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే మీడియాలో చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి.. అలా మా జీవితాల్లోకి వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని’’ చరణ్ అన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here