రాకేష్ మాస్టర్ చెప్పినట్లే చేసిన శేఖర్, జానీ మాస్టర్లు.. ఇంత నీచులా

- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరణించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆయనకు రక్త విరోచనాలు, వాంతులు కావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో.. రాకేష్ మాస్టర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఆయన మరణంతో మరోసారి తెరపైకి రాకేష్ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన గొడవ తాలుకు వార్తలు వైరల్ గా మారాయి.

రాకేష్ మాస్టర్
రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ మాస్టర్ కు ఆయన గురువు అన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం ఇండస్ట్రీ మెుత్తం తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు ఏంటో.. వాళ్లు ఆయన్ని ఎంత దారుణంగా మోసం చేశారో రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘శేఖర్ మాస్టర్ ను నా కన్నబిడ్డలా చూసుకున్నాను. శేఖర్ పెళ్లి కూడా నేనే చేశాను. కానీ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. తన గురువు ప్రభుదేవా అని చెప్పుకొచ్చాడు. అలా చెప్పడం నాకు బాధకలిగించింది. అదీకాక శేఖర్ బిడ్డ బర్త్ డేకి కూడా నాకు చెప్పలేదు” అని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అలాగే జానీ మాస్టర్ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు రాకేష్ మాస్టర్ చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే రాకేష్ మాస్టర్ తన శవాన్ని కూడా శేఖర్ తాకడానికి వీల్లేదని అన్నారని తెలుస్తోంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు శేఖర్ మాస్టర్. ఓ రోజు రాకేష్ మాస్టర్ తాగి వచ్చి తన తల్లిని తిట్టారని శేఖర్ మాస్టర్ అన్నారు. దాంతో మాస్టర్ తో మాట్లాడ్డం మానేశానని శేఖర్ మాస్టర్ తెలిపారు.

- Advertisement -

మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చనిపోతే ఇండస్ట్రీ ఏమనుకుంటుందోనని శేఖర్ మాస్టర్,జానీ మాస్టర్, సత్యం మాస్టర్ శవాన్ని చూడడానికి వస్తారు కావచ్చు. కానీ శేఖర్ మాస్టర్,సత్యం మాస్టర్ ఇద్దరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ లోలోపల మాత్రం నేను చనిపోయినందుకు చాలా సంతోషపడతారు. ఇక జానీ మాస్టర్ కి ఏడుద్దాం అన్నా కూడా కన్నీళ్లు రావు. దాంతో జండుబామ్ పెట్టుకొని మేనేజ్ చేస్తారు.. అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాకేష్ మాస్టర్ నేను చచ్చినా కూడా నా శవాన్ని తాకవద్దు అంటూ శేఖర్ మాస్టర్ కి చెప్పారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here