నటుడు పృథ్విరాజ్‎కు భారీ ప్ర‌మాదం.. ఆందోళనలో ప్ర‌భాస్ ఫ్యాన్స్

- Advertisement -

మలయాళంలో ప్రస్తుతం సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘విలయత్ బుద్ధ’. ఈ సినిమా షూటింగ్‌లో పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో గాయాల పాలైన పృథ్వీరాజ్ ను సోమవారం ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

పృథ్విరాజ్
పృథ్విరాజ్

ప్రస్తుతం అతని కాలికి కీహోల్ ఆపరేషన్ చేయనున్నట్టు సమాచారం. కేరళలోని మరయూర్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేస్తే ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ శస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సర్జరీ తర్వాత దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదం కారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
Prabhas prudviraj

ఆయన ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ లో విలన్ గా నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్సిడెంట్ తో.. సలార్ రిలీజ్ వాయిదా పడుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో పృథ్వీరాజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here