Jai Hanuman : జై హనుమాన్ విషయంలో మాట మార్చిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడటా..!

- Advertisement -

Jai Hanuman : డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే తెరకెక్కిస్తూ ప్రేక్షకుల నాడీని తెలుసుకున్నాడు. అలానే కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొట్టింది.

ఇటీవల ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా అక్కడ కూడా భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా ‘జై హనుమాన్’ సినిమా రాబోతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని చెప్పినా ఇప్పటివరకు సినిమా స్క్రిప్ట్ గురించి ఎక్కడ ప్రస్థావించలేదు. ఇకపోతే ఈ సినిమా కన్నా ముందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఆక్టోపస్’ అనే సినిమాని కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్..ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందట. ఫస్ట్ ఆ సినిమాను పూర్తి చేసి తర్వాత జై హనుమాన్ సినిమాను మొదలు పెట్టబోతున్నారని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ‘ జై హనుమాన్ ‘ ను సెట్స్ మీదకు తీసుకువస్తాడని సమాచారం. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here