నిర్మాతతో గొడవ.. డబ్బు కోసం ఆ పనులు కూడా చేశానన్న తెలుగు నటి!

- Advertisement -

టాలీవుడ్‌లో హీరోయిన్స్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ముందు వరుసలో ఉంటారు. వాళ్ల వయసు పెరుగుతున్నా కూడా ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరిని అలరిస్తు ఉంటారు. అలాంటి వాళ్లలో నటి ప్రగతి ఒకరు. వర్కౌట్స్, డ్యాన్స్‌ వీడియోలతో నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఆమె ఎక్కువగా తల్లి పాత్రలలో కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా పోస్టులు పెడుతుంటారు. దీంతో ఈమెకు నెట్టింట తెగ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితంలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. డబ్బు కోసం కొన్ని పనులు కూడా చేసినట్లు చెప్పారు.

నటి ప్రగతి
నటి ప్రగతి

ఇకపోతే ఇండస్ట్రీలోకి రాకముందు తాను మోడలింగ్ చేయాలనేది తన కోరిక అయితే కొంతమంది ఊరికే తింటున్నావ్ అంటూ కామెంట్లు చేస్తే తనకు నచ్చేది కాదు అని ఆమె వెల్లడించింది. ఏ జాబ్ లేకుండా ఉన్న సమయంలో ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నావ్ అని తన తల్లి మాటలు అంటుంటే నచ్చక పిజ్జా షైపులో పని చేశానని చెప్పారు. అప్పట్లో డబ్బుల కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని చెప్పారు. ఆ సమయంలో తాను బొద్దుగా ఉండటంతో ఓ యాడ్ లో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. అలా మోడలింగ్‌ రంగంవైపు అడుగులు వేసిందట. అప్పుడు హీరోయిన్‌గానూ అవకాశాలు వచ్చాయన్న ఆమె వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయానని తెలిపారు.

Actress Pragathi

మోడలింగ్ చేసే సమయంలో హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుని 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొంత కాలానికి తన భర్తతో విభేదాలు రావడం వల్ల ప్రగతి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here