పెళ్లై.. విడాకులైన హీరోతో దానికి సిద్ధమైన పూజా హెగ్డే..

- Advertisement -

ప్రస్తుతం పూజా హెగ్డేకు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యత తగ్గించి సెకండ్ హీరోయిన్ చేశాడట. దాంతో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం కి గుడ్ బై చెప్పేసింది. మహేష్ బాబు తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారనుకుంటే ఆ ఆశ కూడా చేజారింది. గత ఏడాది ఇలానే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కింది.

మొదట్లో ఐరన్ లెగ్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ రెండు మూడు సినిమాల తర్వాత కాస్త ఫామ్ లోకి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలా మధ్యలో చేసిన కొన్ని సినిమాలు బాగానే సక్సెస్ అందించాయి.ఆ సమయంలో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా పూజ హెగ్డేనే ఉండేది. ఏ హీరోలైన, దర్శకులైన దగ్గరికి వచ్చి మరి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలా కొంతకాలం ఈ ముద్దుగుమ్మ హవా బాగా నడిచింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. అలా వైకుంటపురంలో సినిమా తర్వాత దరిద్రం వెంటాడుతుందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడుకు బాగానే అవకాశాలు వచ్చాయి.

poojahegde
poojahegde

ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా ఫ్లాప్స్ రావడంతో అక్కడ కూడా పట్టించుకునే నాధుడే లేదని చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేకపోవడంతో ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది. అదేంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీపై ఉన్న మోజుతో అక్కడ అవకాశాలు సంపాదించడం కోసం.. పెళ్ళై విడాకులు తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందట. ఇక పూజ ఈ నిర్ణయం తీసుకోవడంతో తన తల్లిదండ్రులు కూడా తనపై మండిపడుతున్నట్లు తెలిసింది. కానీ పూజ మాత్రం అవకాశాల కోసం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుందని.. త్వరలో తన పెళ్లి గురించి అఫీషియల్ గా ప్రకటిస్తుందని తెలిసింది. ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో.. అవకాశాల కోసం సెకండ్ వైఫ్ గా వెళ్లడానికి కూడా సిద్ధపడ్డావా.. ఎంత దిగజారిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here