టీజర్ లేకుండానే ఆ ప్రాంతం లో 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు అసాధ్యం అని అనుకున్న ఎన్నో సంఘటనలు పవన్ కళ్యాణ్ విషయం లో నిజం అయ్యాయి. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ విషయం లో వేసిన అంచనాలు కొన్ని సార్లు తప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్టార్ స్టేటస్ టాలీవుడ్ లో ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బ్రో ది అవతార్
బ్రో ది అవతార్

అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ ఈమధ్య ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండడం వల్ల అభిమానులు కాస్త నిరాశకి గురి అవుతూ వస్తున్న సంగతి నిజమే.కానీ ఆయన ఆ రీమేక్ సినిమాలతో కూడా రికార్డ్స్ ని సృష్టించి అభిమానులను సర్ప్రైజ్ కి గురి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు రీసెంట్ ఉదాహరణే ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం.

ఈ సినిమా వచ్చే నెలలోనే గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది.కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాలేదు, దీనిపై ఒక పక్క ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరో పక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో రికార్డ్స్ ని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తుంది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇక సీడెడ్ ప్రాంతం లో కూడా ఈ చిత్రం 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అట. అలా ఆంధ్ర ప్రదేశ్ మరియు సీడెడ్ ప్రాంతాలకు కలిపి 62 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం, నైజాం ప్రాంతం లో 30 కోట్ల రూపాయలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈ నెల 29 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here