PKSDT : జులై 28 వ తారీఖున #PKSDT మూవీ విడుదల.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

- Advertisement -

PKSDT : నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ, ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉందట.ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించాడు.ఈ 30 రోజులకు గాను 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. గత నెల నుండి విరామం లేకుండా సాగుతున్న ఈ సినిమా షూటింగ్, పవన్ కళ్యాణ్ సన్నివేశాలకు సంబంధించి ఈ నెల 28 వ తారీఖుతో ముగుస్తుంది అట.

PKSDT
PKSDT

ఈ సందర్భంగా మూవీ టీం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసారు.ఈ చిత్రాన్ని జులై 28 వ తారీఖున విడుదల చేయబోతున్నామని.ఇక నుండి అదిరిపొయ్యే అప్డేట్స్ రోజు వస్తూనే ఉంటాయని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్విట్టర్ లో అధికారికంగా ఒక ట్వీట్ వేసింది.సుమారు ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూడబోతున్నందుకు అభిమానులు ఎంతో ఆనందం గా ఫీల్ అవుతున్నారు.

Pawan Kalyan sai dharam tej

ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజి కి తగ్గట్టుగా, ఎక్కడ కూడా ఆయన అభిమానులు నిరాశ చెందకుండా ఉండేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుడు,ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండేలా చూసుకుంటున్నాడట.

- Advertisement -
PKSDT Movie

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే విధంగానే ఈ చిత్రం ఉంటుందని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి త్రివిక్రమ్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటూనే, గుండెల్ని పిండేసే విధంగా ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఈ చిత్రం లో ఉంటాయని తెలుస్తుంది.మరి వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here