Guntur Kaaram టోటల్ బిజినెస్ ని కేవలం 2 ప్రాంతాల బిజినెస్ తో దాటేసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’

- Advertisement -

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో తారా స్థాయి అంచనాలు ఉంటాయి, వాటిని అందుకోవడం అంత తేలికైన పని కాదని అందరూ అనుకున్నారు.

Guntur Kaaram
Guntur Kaaram

కానీ ‘గుంటూరు కారం’ చిత్రం అందరి అంచనాలను దాటి సర్ప్రైజ్ కి గురి చేసింది. ఇకపోతే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సంక్రాంతి పండుగ కాబట్టి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం పది రోజుల లోపే దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పడూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

pawan kalyan

సినిమా నైజాం ప్రాంతం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 54 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు టాక్. #RRR మరియు ‘సలార్’ చిత్రాల తర్వాత ఆ రేంజ్ బిజినెస్ ని జరుపుకున్న సినిమా ఇదే. అలాగే కర్ణాటక ప్రాంతం లో 20 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 16 కోట్ల రూపాయలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.

- Advertisement -
prabhas mahesh pawan kalyan

అలా ఈ మూడు ప్రాంతాలకు కలిపే వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ‘గుంటూరు కారం‘ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి జరిగిన ఈ ప్రీ రిలీజ్ బిజినెస్, ఓజీ కి కేవలం మూడు ప్రాంతాల నుండే జరగడం విశేషం. ఇక పూర్తి స్థాయి బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 130 కోట్ల రూపాయలకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here