Niharika Konidela : వామ్మో.. ప‌ద‌కొండు మంది హీరోల‌తో నిహారిక మూవీ..!

- Advertisement -

Niharika Konidela : విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక దాదాపు ఐదేళ్ల తర్వాత ఏం చేప అనే టైటిల్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నిహారిక అష్టలక్ష్మి అనే అమ్మాయిగా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించబోతోంది.

నిహారిక కొణిదెల నటనపై దృష్టి సారిస్తూనే నిర్మాతగానూ సినిమాలు చేస్తోంది. కాగా, నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో తన సొంత బ్యానర్‌ను స్థాపించింది. ఇప్పటి వరకు నిహారిక ఈ బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లు మాత్రమే చేసింది. పింక్ ఎలిఫెంట్ సంస్థలో నిహారిక ఫస్ట్ టైమ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీతో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కుర్రాళ్లు అనే టైటిల్ ను కమిటీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

కమిటీ కుర్రాళ్లు సినిమాతో పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను టాలీవుడ్‌కి పరిచయం చేస్తోంది నిహారిక. ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మతో పాటు పలువురు యూట్యూబర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా మిగిలిన హీరోలుగా కనిపించనున్నారు. శరణ్య సురేష్, తేజస్వీ రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సింగర్ అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here