మహేష్ బాబు కారణంగా నవీన్ పొలిశెట్టి రాత్రంతా నిద్రపట్టలేదట.. కారణమిదే..

- Advertisement -

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టిలు న‌టించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆక‌ట్టుకోగా, కామెడీకి జ‌నాలు ఫిదా అయ్యారు.

నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి

సినీ విమర్శకుల నుంచి ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. ఈక్ర‌మంలోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ న‌వీన్ ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో న‌వీన్ వ‌ర్జీనియాలో ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్ర‌మోష‌న్స్ కోసం సియాటెల్‌కు వెలుతున్న‌ట్లు తెలిపాడు. అయితే వ‌ర్షం కార‌ణంగా విమానాలు లేక‌పోవ‌డంతో 15 గంట‌లుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్న‌ట్లు చెప్పాడు. వేరే భాషా సినిమాల‌తో పాటు తాను న‌టించిన సినిమాను విడుద‌ల చేయ‌డంపై మొద‌ట్లో కంగారు ప‌డిన‌ట్లు వెల్ల‌డించాడు.

అయితే.. ప్రేక్ష‌కుల నుంచి త‌న సినిమాకు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి ఎంతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను అభినందిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు చేసిన ట్వీట్ల పై న‌వీన్ మాట్లాడాడు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేసిన ట్వీట్ చూసిన‌ త‌రువాత త‌న‌కు రాత్రి అంతా నిద్ర ప‌ట్ట‌లేద‌న్నాడు. త్వ‌ర‌లోనే వ‌స్తాన‌ని, ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకుంటాన‌ని చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here