Naresh : పెళ్లయితే అయింది కానీ నాకు ఆ సంతోషమే లేదు.. ఆవిడ అంతగా బాధించిందా ?

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నరేష్. కెరీర్ తొలినాళ్లలో హీరోగా చేసి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. నటుడిగా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన సినిమాల ద్వారా ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ ఇటీవల నరేష్ అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఆయన పేరు ఆ రేంజ్ లో వైరల్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్నాడన్న రూమన్ నిజమైనప్పటి నుంచి వీళ్ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని పలు షోలకి, ఈవెంట్స్ కి జంటగా అటెండ్ అవుతూ ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల వారిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమా కూడా తీశారు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో తెలియదు కానీ హీరో నరేష్ మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. మరి పెట్టిన ఖర్చు వచ్చిందా అనేది మాత్రం కాస్త డౌటే.

నరేష్ తన నటనలో 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా లైఫ్ లో తాను ఎన్నో కష్టాలు.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చాడు నరేష్. మాటల మధ్యలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. రమ్య రఘుపతి పెట్టిన బాధలు మర్చిపోలేంటూ పరోక్షంగా ఆయన గుండెల్లోని ఆవేదనను వ్యక్తపరిచాడు. అంతేకాదు..ఆమె దగ్గర నా బిడ్డ ఉండడం సేఫ్ కాదని.. అది అతడి ఫ్యూచర్ కి చాలా డేంజర్ అని భావించాడు. అసలు ఆమెతో పెళ్లయితే అయింది కానీ ఏనాడు సంతోషంగా లేనని బాధపడ్డాడు నరేష్. అన్ని బాధల్లో ఉన్నప్పుడు పవిత్ర తన లైఫ్ లోకి రావడం చాలా చాలా సంతోషంగా అనిపించిందని.. నన్ను నన్నుగా అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ దొరికినందుకు.. సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here