Namrata Shirodkar : జెర్మనీ లో అడవుల పాలైన సూపర్ స్టార్ మహేష్ బాబు.. కన్నీళ్లు పెట్టుకున్న నమ్రత!

- Advertisement -

Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ ని ఈ సినిమా నిరాశపరిచినంతగా గడిచిన పదేళ్లలో ఏ సినిమాకూ నిరాశపర్చలేదు అని చెప్పొచ్చు.

Namrata Shirodkar
Namrata Shirodkar

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయిపోయిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కి సంబంధించిన లుక్ టెస్ట్స్ కూడా పూర్తి చేశారట. ఈ లుక్స్ ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయట.

Mahesh Babu Rajamouli

ఇకపోతే త్వరలోనే వర్క్ షాప్ మొదలయ్యే అవకాశం ఉండడం తో, మహేష్ బాబు జెర్మనీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జర్మనీ లో ఉన్న బ్లాక్ ఫారెస్ట్ ని వీక్షించిన మహేష్, అక్కడ ట్రెక్కింగ్ మొదలు పెట్టాడు. ఆయనతో పాటుగ ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఆ అడవుల్లోకి వచ్చాడు. ఆయనతో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా లో మహేష్ బాబు అప్లోడ్ చెయ్యగా, అది తెగ వైరల్ గా మారింది.

- Advertisement -

ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను చూసిన మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కామెంట్స్ చేస్తూ ‘నేను ఈ అడవిని మిస్ అవుతున్నాను.. నిన్ను కూడా బాగా మిస్ అవుతున్నాను’ అంటూ ఎమోషనల్ గా కామెంట్ చేసింది. మహేష్ రాజమౌళి సినిమా మొత్తం ఫోర్స్ నేపథ్యం లో ఉండడం తో ముందుగానే అక్కడి ప్రదేశాలను అలవాటు చేసుకోవడానికి మహేష్ ఈ ట్రిప్ వేసినట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here