తెలుగు దర్శకులు వద్దు.. అక్కడి వాళ్లు కావాలి.. పబ్లిక్ గా చెప్పిన మృణాల్‌ ఠాకూర్‌

- Advertisement -

ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌ 76వ ఎడిషన్ వేడుకలు ప్రారంభమైంది. ఫ్రాన్స్‌‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు హాజరవుతారు. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సారి రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు భారత్‌ నుంచి ఎవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు, తొలిసారిగా కొందరిని ఈ అదృష్టం వరించింది. దీంతో తారలంతా ఆనందంలో తేలియాడుతున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునేది రెడ్ కార్పెట్. ఈ స్పెషల్ ఈవెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలామంది అందాల ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్ పై తమ అందాలను ఒలకబోస్తారు.

మృణాల్‌ ఠాకూర్‌
మృణాల్‌ ఠాకూర్‌

ఈ వేడుకకు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తొలిసారి హాజరుకానుంది. దీనిపై ఆమె స్పందిస్తూ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని తెలిపింది. ‘ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదటిసారి ఆ వేదికపై అడుగుపెట్టనున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న దర్శకనిర్మాతలతో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. కొత్త అవకాశాల కోసం, నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను’ అని చెప్పింది. దీంతో ఈ అమ్మడు ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక్కడి వాళ్లు చాల్లేదా అని నెటిజన్లు అంటున్నారు.

మృణాల్
మృణాల్

ఇక మరోవైపు వరుస సినిమాలతో అదరగొడుతోన్న మృణాల్‌‌‌కు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మ‌ృణాల్ రిసెంట్‌గా ఓ కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది. మృణాల్ మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారును కొన్నట్లు తెలుస్తోంది. మూలుగా ఈ కారును పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కొనుగోలు చేస్తారట. మృణాల్ ప్రస్తుతం తెలుగులో ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నారట. ఈ మొత్తం సౌత్‌లో టాప్‌ హీరోయిన్స్ నయనతార, సమంతలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ల కంటే ఎక్కువని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here