Manchu Lakshmi : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మంచు లక్ష్మీ.. మోడీ ఆఫీస్ నుంచి ఫోన్ ?

- Advertisement -

Manchu Lakshmi : డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు రాజకీయ రంగ ప్రవేశం కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంది. మోడీకి మంచు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండగా గతంలో వారిద్దరు చాలాసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బీజేపీలోకి మంచు లక్ష్మిని ఆహ్వానించటానికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి పిలుపు అందిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2024 ఎన్నికల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని బీజేపీ భావిస్తుంది.

Manchu Lakshmi
Manchu Lakshmi

తెలంగాణలో బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది. కానీ ఏపీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అసలు ఆ పార్టీ ఉనికి కూడా కానరావట్లేదు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి బీజేపీలోకి నిజంగా ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. మంచు లక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మంచు లక్ష్మి ఢిల్లీ పర్యటన ఊహాగానాలను తావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇటీవల కేంద్రం మహిళా బిల్లును ఆమోదించింది. ఈ క్రమంలోనే సంఘంలో పేరున్న ఎంతోమంది మహిళలను పిలిపించి మాట్లాడనున్నారని.. అందులో భాగంగానే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి ఆహ్వానం అందిందని పలువురు పేర్కొంటున్నారు. మంచు లక్ష్మి ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసి.. వచ్చిన తర్వాత మాత్రమే ఇతర విషయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here