బయట పడ్డ మంచు ఫ్యామిలీ విభేదాలు.. సోదరులకు రాఖీ కట్టని మంచు లక్ష్మి

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీల్లో ఒకటి మంచు కుటుంబం. ఈ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ రాయళ్లు అదే పనిగా ట్రోలింగ్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అదంతా పుకార్లేనని మీమంతా ఒకటేనని వాటికి సమాధానంగా చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతటి ప్రయత్నాలు చేసినా ఆ రూమర్లు మాత్రం తగ్గడం లేదు.. ఎప్పటికప్పుడు కొత్త రూమర్లు పుడుతూనే ఉన్నాయి.

మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

తాజాగా మంచు వారి ఆడపడుచు మంచు లక్ష్మి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా ఈ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా తలెత్తిన విభేదాలు నిజమేనని చర్చించుకుంటున్నారు. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. గతంలో సోషల్ మీడియాలో మంచు విష్ణు, మనోజ్ అనుచరుడితో వాగ్వాదానికి దిగిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయంపై తెగ రచ్చ జరిగింది.

తర్వాత మంచు మనోజ్ రెండో పెళ్లిలో తన అన్న మంచు విష్ణు కుటుంబం పెద్దగా సందడి చేయకపోవడంతో ఈ విషయం నిజమేనని కన్ఫామ్ చేసేశారు జనాలు. మనోజ్ అక్క మంచు లక్ష్మి మాత్రం తమ్ముడికి పెళ్లిని దగ్గరుండి మరి ప్రతి ఒక్కటి చూసుకుంటూ అంగరంగ వైభవంగా జరిపించింది. అప్పుడు చూసిన వారంతా మంచు ఫ్యామిలీలో నిజంగానే సఖ్యత లోపించిందని అనుమానపడ్డారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో ఇలాంటి చర్చలకు దారితీస్తోంది.

- Advertisement -

రక్షా బంధన్ సందర్భంగా మంచు లక్ష్మి తన తమ్ముడు మంచు మనోజ్ కు రాఖీ కట్టి వారితో కలిసి రెస్టారెంట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసి..‘ప్రేమతో సరదాగా సమయాన్ని గడిపేందుకు రుచికరమైన భోజనం చేసి రాఖీ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నాను’ అంటూ ఒక క్యాప్షన్ ని కూడా రాశారు. అయితే ఈ ఫోటోలో తన పెద్ద తమ్ముడు విష్ణు మాత్రం ఎక్కడా లేడు. దీంతో నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎవరు త్వరగా స్పందిస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here