హీరోయిన్ త్రిష ప్రమేయం లెకపొయ్యుంటే మహేష్ – నమ్రత పెళ్లి జరిగేది కాదా..? బయటపడ్డ షాకింగ్ నిజం!

- Advertisement -

టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ మీద మోస్ట్ క్యూట్ పెయిర్ గా అనిపించే జంటలలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రిష జంట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘అతడు’, ‘సైనికుడు’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఈ జంట కి మాత్రం మంచి పేరు వచ్చింది.

త్రిష
త్రిష

ఇండస్ట్రీ లో మొదటి నుండి ఇలాంటి క్యూట్ జంటలపై కావాల్సినన్ని రూమర్స్ పుట్టించే అలవాటు మీడియా కి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా అప్పట్లో ఈ జంట మీద కూడా అలాంటి రూమర్స్ చాలానే వచ్చాయి. మహేష్ – త్రిష ప్రేమించుకుంటున్నారని , ఇప్పుడు వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారు అంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. దీనిపై అప్పట్లో మహేష్ తో లవ్ లో ఉన్న నమ్రత చాలా ఫైర్ అయ్యిందట.

తొలుత మహేష్ – త్రిష క్లోజ్ గా ఉండడం చూసి, వీళ్లిద్దరు స్నేహితులే కదా, ఏమి కాదులే అని అనుకున్నారు. కానీ ఈ రూమర్స్ వచ్చేలోపు ఆమెకి కూడా అనుమానాలు మొదలు అయ్యాయి. అప్పట్లో ఈ విషయమై తరచూ మహేష్ , నమ్రత మధ్య గొడవలు కూడా వచ్చేవట. దీంతో నమ్రత కి తన మీద రోజురోజుకి నమ్మకం పోతుంది అనే ఉదేశ్యం తో అతడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే పెద్దల సమక్షం లో ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

ఆ తర్వాత ఈ జంట ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో అన్యోయంగా ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఈ జంటని ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే సైనికుడు సినిమా సమయం లో హీరోయిన్ ని ఎవర్ని తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా, డైరెక్టర్ గుణశేఖర్ త్రిష పేరు సూచించాడట,కానీ మహేష్ నమ్రత కి ఇష్టం లేదు వేరే ఎవరినైనా చూడమని చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న నమ్రత స్వయంగా మహేష్ కి ఫోన్ చేసి త్రిష అయితేనే ఈ సినిమాకి బాగుంటుంది, తీసుకోండి అని చెప్పిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here