‘భోళా శంకర్’ ఎఫెక్ట్..’బ్రో ది అవతార్’ థియేటర్స్ భారీగా పెంపు..15 వ రోజు ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి అట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పై అభిమానుల్లో తప్ప మిగతా ఆడియన్స్ లో మొదటి నుండి నెగటివ్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే ఈ సినిమా ఒక రీమేక్ ,పైగా మెహర్ రమేష్ లాంటి వరస్ట్ ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ దర్శకత్వం వహించడం మరో పెద్ద మైనస్. అందుకే ఆడియన్స్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

భోళా శంకర్
భోళా శంకర్

అయితే చిత్రం డీసెంట్ గా ఉన్నా మెగాస్టార్ స్టార్ పవర్ తో లాగేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే వరస్ట్ గా ఔట్పుట్ రావడం తో మెగాస్టార్ కూడా ఈ చిత్రాన్ని సేవ్ చెయ్యలేకపోయాడు. రెండు వారల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రాన్ని ‘భోళా శంకర్’ కోసం దాదాపుగా అన్నీ థియేటర్స్ లో తొలగించారు.

అయితే నిన్న ‘భోళా శంకర్’ చిత్రానికి టాక్ రాకపోవడం తో ప్రధాన నగరాల్లో మళ్ళీ ‘బ్రో యితే అవతార్’ చిత్రానికి ఈరోజు నుండి థియేటర్స్ కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఆ చిత్రానికి వీకెండ్స్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా వస్తున్నారు, ఈ వీకెండ్ థియేటర్స్ లో ఉంచితే కచ్చితంగా ఆ చిత్రం మరోసారి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల వరకు రికవరీ చేస్తుందని బయ్యర్స్ నమ్మకం తో ఉన్నారు.

- Advertisement -

ఇక 15 వ రోజు ‘బ్రో ది అవతార్‘ చిత్రం కొత్త సినిమా విడుదల అయ్యినప్పటికీ కూడా 20 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట. నిన్న మార్నింగ్ షోస్ చాలా దారుణంగా దెబ్బ తీసినప్పటికీ సాయంత్రం నుండి పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here