Guntur Kaaram : ఫేక్ కలెక్షన్స్ వేస్తే ఇంటికి వచ్చి కొడుతాం అంటూ ‘గుంటూరు కారం’ నిర్మాతకి మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్!

- Advertisement -

Guntur Kaaram : మహేష్ బాబు పేరు ఎత్తితే ఈమధ్య ఎక్కువ ఫేక్ కలెక్షన్స్ అనే పదం సోషల్ మీడియా లో చాలా బలంగా వినిపిస్తుంది. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం కి అయితే హద్దులు దాటి మరీ ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు. ఎదో ఒక కోటి, రెండు కోట్లు ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఏకంగా వంద కోట్ల రూపాయిల ఫేక్ కలెక్షన్స్ ని వేసుకోవడం తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక్క ‘గుంటూరు కారం’ విషయం లోనే జరిగింది.

Guntur Kaaram
Guntur Kaaram

మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. నైజాం లో 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేని ఈ సినిమాకి ఏకంగా 17 కోట్ల రూపాయిల షేర్ ని వేసుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు, 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకుండానే ఏకంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ పోస్టర్ ని దింపారు.

ఈ పోస్టర్ ని చూసి అందరూ నవ్వుకున్నారు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం వెనకేసుకొని వచ్చారు. పోనీ అక్కడితో ఆగిపోయారా అంటే అది కూడా లేదు. రెండు మూడు రోజుల క్రితమే 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది అంటూ మరో పోస్టర్ ని విడుదల చేశారు. దీనికి మండిపోయిన మహేష్ బాబు ఇక ఫేక్ పోస్టర్స్ ఆపండి, ఇలాగే వదిలేస్తే త్వరలో వెయ్యి కోట్ల రూపాయిల పోస్టర్ ని కూడా విడుదల చేసేట్టు ఉన్నారు అంటూ మూవీ టీం పై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు.

- Advertisement -

ఇంకోసారి ఇలా ఫేక్ పోస్టర్ వదిలి హీరో పరువు తీసే కార్యక్రమం పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చి మరీ కొడుతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సొంత హీరో అభిమానులే ఈ రేంజ్ లో తిట్టడం చరిత్రలో ఇదే తొలిసారి జరగడం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here